కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలు..భారీ జరిమానాలు..!!
- April 23, 2025
కువైట్: 2025 శాసనసభ డిక్రీ నంబర్ 5 ప్రకారం..కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేయడంతో కువైట్ రోడ్డు భద్రతా ప్రయత్నాలలో ఒక ప్రధాన మార్పు ప్రారంభమైంది. పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలను పరిష్కరించడానికి ఈ చట్టం కఠినమైన జరిమానాలు, పోలీసులకు విస్తృత అధికారాలను కల్పించారు.
వికలాంగుల కోసం కేటాయించిన ప్రదేశాలలో వాహనాన్ని నడపడం లేదా పార్కింగ్ చేయడం చేస్తే KD 150 జరిమాన విధిస్తారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగించడం వల్ల ఇప్పుడు KD 75 ఖర్చవుతుంది. సీట్ బెల్ట్ ధరించకపోతే KD 30 జరిమానా విధించబడుతుంది. గంటకు 50 కి.మీ కంటే ఎక్కువ వేగ పరిమితిని దాటిన లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్లను ఇప్పుడు అక్కడికక్కడే అరెస్టు చేసే అధికారాన్ని కల్పించారు.
మద్యం సేవించి వాహనం నడిపేవారిని, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లేదా అక్రమ టాక్సీ సర్వీసుల వంటి అనుమతి లేని కార్యకలాపాలకు వాహనాలను దుర్వినియోగం చేసేవారిని అరెస్టు చేయడానికి కూడా ఈ చట్టం పోలీసులకు అధికారం కల్పించింది.
తాజా వార్తలు
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!









