కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలు..భారీ జరిమానాలు..!!
- April 23, 2025
కువైట్: 2025 శాసనసభ డిక్రీ నంబర్ 5 ప్రకారం..కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేయడంతో కువైట్ రోడ్డు భద్రతా ప్రయత్నాలలో ఒక ప్రధాన మార్పు ప్రారంభమైంది. పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలను పరిష్కరించడానికి ఈ చట్టం కఠినమైన జరిమానాలు, పోలీసులకు విస్తృత అధికారాలను కల్పించారు.
వికలాంగుల కోసం కేటాయించిన ప్రదేశాలలో వాహనాన్ని నడపడం లేదా పార్కింగ్ చేయడం చేస్తే KD 150 జరిమాన విధిస్తారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగించడం వల్ల ఇప్పుడు KD 75 ఖర్చవుతుంది. సీట్ బెల్ట్ ధరించకపోతే KD 30 జరిమానా విధించబడుతుంది. గంటకు 50 కి.మీ కంటే ఎక్కువ వేగ పరిమితిని దాటిన లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్లను ఇప్పుడు అక్కడికక్కడే అరెస్టు చేసే అధికారాన్ని కల్పించారు.
మద్యం సేవించి వాహనం నడిపేవారిని, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లేదా అక్రమ టాక్సీ సర్వీసుల వంటి అనుమతి లేని కార్యకలాపాలకు వాహనాలను దుర్వినియోగం చేసేవారిని అరెస్టు చేయడానికి కూడా ఈ చట్టం పోలీసులకు అధికారం కల్పించింది.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







