బ్యూనస్ ఎయిర్స్ బుక్ ఫెయిర్ 2025.. రియాద్ పెవిలియన్ ప్రారంభం..!!
- April 24, 2025
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో 2025 ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు జరగనున్న 49వ బ్యూనస్ ఎయిర్స్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో రియాద్ పెవిలియన్ను ప్రారంభం అయింది. లాటిన్ అమెరికాలో సౌదీ అరేబియా సాంస్కృతిక ఉనికిని బలోపేతం చేయడం, సౌదీ విజన్ 2030 యొక్క పరివర్తనలను ప్రతిబింబించే ఆధునిక, భవిష్యత్తును చూసే రాజధాని నగరంగా రియాద్ను పరిచయం చేయడం రియాద్ పెవిలియన్ లక్ష్యం. సాంస్కృతిక బ్రిడ్జి నిర్మించడంలో సహాయపడటానికి స్పానిష్లోకి అనువదించబడిన రచనలతో సహా ఈ పెవిలియన్ విభిన్న సాహిత్య, సాంస్కృతిక విషయాలను కలిగిన ప్రచురణలను ఏర్పాటు చేశారు. సాహిత్య కమిషన్ CEO డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్-వాసిల్ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా - అర్జెంటీనా మధ్య బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి సాంస్కృతిక సహకారం ప్రాముఖ్యతను వివరించారు. రియాద్ను గౌరవ అతిథిగా ఎంచుకోవడం వల్ల ప్రజల మధ్య సాంస్కృతిక సంభాషణకు అవకాశాలు పెరుగుతాయని అర్జెంటీనా బుక్ ఫౌండేషన్ అధ్యక్షురాలు క్రిస్టీన్ రైనాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







