బ్యూనస్ ఎయిర్స్ బుక్ ఫెయిర్ 2025.. రియాద్ పెవిలియన్ ప్రారంభం..!!
- April 24, 2025
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో 2025 ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు జరగనున్న 49వ బ్యూనస్ ఎయిర్స్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో రియాద్ పెవిలియన్ను ప్రారంభం అయింది. లాటిన్ అమెరికాలో సౌదీ అరేబియా సాంస్కృతిక ఉనికిని బలోపేతం చేయడం, సౌదీ విజన్ 2030 యొక్క పరివర్తనలను ప్రతిబింబించే ఆధునిక, భవిష్యత్తును చూసే రాజధాని నగరంగా రియాద్ను పరిచయం చేయడం రియాద్ పెవిలియన్ లక్ష్యం. సాంస్కృతిక బ్రిడ్జి నిర్మించడంలో సహాయపడటానికి స్పానిష్లోకి అనువదించబడిన రచనలతో సహా ఈ పెవిలియన్ విభిన్న సాహిత్య, సాంస్కృతిక విషయాలను కలిగిన ప్రచురణలను ఏర్పాటు చేశారు. సాహిత్య కమిషన్ CEO డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్-వాసిల్ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా - అర్జెంటీనా మధ్య బలమైన సంబంధాలను హైలైట్ చేశారు. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి సాంస్కృతిక సహకారం ప్రాముఖ్యతను వివరించారు. రియాద్ను గౌరవ అతిథిగా ఎంచుకోవడం వల్ల ప్రజల మధ్య సాంస్కృతిక సంభాషణకు అవకాశాలు పెరుగుతాయని అర్జెంటీనా బుక్ ఫౌండేషన్ అధ్యక్షురాలు క్రిస్టీన్ రైనాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







