భార్యతో కలిసి సెలవులకు వెళ్లగా.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దుబాయ్ ప్రవాసి మృతి..!!
- April 24, 2025
యూఏఈ: మంగళవారం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో దుబాయ్లో నివసిస్తున్న, పనిచేస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసి కూడా ఉన్నట్లు గుర్తించారు. అతని మరణాన్ని దగ్గరి బంధువు ధృవీకరించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన నీరాజ్ ఉధ్వాని తన భార్యతో కలిసి సెలవులకు కాశ్మీర్ వెళ్లాడు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లో స్నేహితుడి వివాహం కోసం భారతదేశానికి వెళ్లినట్లు మృతుడి బంధువు తెలిపారు.
నీరాజ్ జైపూర్కు చెందినవాడు. చాలా కాలంగా దుబాయ్లో నివసిస్తున్నాడు. అతను ఇండియన్ హై స్కూల్లో పూర్వ విద్యార్థి. అతను నగరంలోని కాగ్నిటా స్కూల్ గ్రూప్లో ఫైనాన్స్ ప్రొఫెషనల్గా ఉద్యోగం చేస్తున్నాడు.
“నీరాజ్ రెండేళ్ల క్రితం రాజస్థాన్లో వివాహం చేసుకున్నాడు. మినా రోడ్ వాస్ల్ కమ్యూనిటీలో నివసిస్తున్నాడు. అతని మృతదేహాన్ని ఇప్పుడు జైపూర్కు తరలిస్తున్నారు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి.” అని బంధువు తెలిపారు. కాగా, నీరాజ్ స్నేహితులు కొంతమంది కూడా వివాహం కోసం భారతదేశానికి వెళ్లి ఆ తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. నీరాజ్ జంట మాత్రం సెలవుల కోసం పహల్గామ్కు వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని నీరజ్ స్నేహితులు వాపోయారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!









