భార్యతో కలిసి సెలవులకు వెళ్లగా.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దుబాయ్ ప్రవాసి మృతి..!!
- April 24, 2025
యూఏఈ: మంగళవారం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో దుబాయ్లో నివసిస్తున్న, పనిచేస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసి కూడా ఉన్నట్లు గుర్తించారు. అతని మరణాన్ని దగ్గరి బంధువు ధృవీకరించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన నీరాజ్ ఉధ్వాని తన భార్యతో కలిసి సెలవులకు కాశ్మీర్ వెళ్లాడు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లో స్నేహితుడి వివాహం కోసం భారతదేశానికి వెళ్లినట్లు మృతుడి బంధువు తెలిపారు.
నీరాజ్ జైపూర్కు చెందినవాడు. చాలా కాలంగా దుబాయ్లో నివసిస్తున్నాడు. అతను ఇండియన్ హై స్కూల్లో పూర్వ విద్యార్థి. అతను నగరంలోని కాగ్నిటా స్కూల్ గ్రూప్లో ఫైనాన్స్ ప్రొఫెషనల్గా ఉద్యోగం చేస్తున్నాడు.
“నీరాజ్ రెండేళ్ల క్రితం రాజస్థాన్లో వివాహం చేసుకున్నాడు. మినా రోడ్ వాస్ల్ కమ్యూనిటీలో నివసిస్తున్నాడు. అతని మృతదేహాన్ని ఇప్పుడు జైపూర్కు తరలిస్తున్నారు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి.” అని బంధువు తెలిపారు. కాగా, నీరాజ్ స్నేహితులు కొంతమంది కూడా వివాహం కోసం భారతదేశానికి వెళ్లి ఆ తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. నీరాజ్ జంట మాత్రం సెలవుల కోసం పహల్గామ్కు వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని నీరజ్ స్నేహితులు వాపోయారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







