భార్యతో కలిసి సెలవులకు వెళ్లగా.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దుబాయ్ ప్రవాసి మృతి..!!
- April 24, 2025
యూఏఈ: మంగళవారం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో దుబాయ్లో నివసిస్తున్న, పనిచేస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసి కూడా ఉన్నట్లు గుర్తించారు. అతని మరణాన్ని దగ్గరి బంధువు ధృవీకరించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన నీరాజ్ ఉధ్వాని తన భార్యతో కలిసి సెలవులకు కాశ్మీర్ వెళ్లాడు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లో స్నేహితుడి వివాహం కోసం భారతదేశానికి వెళ్లినట్లు మృతుడి బంధువు తెలిపారు.
నీరాజ్ జైపూర్కు చెందినవాడు. చాలా కాలంగా దుబాయ్లో నివసిస్తున్నాడు. అతను ఇండియన్ హై స్కూల్లో పూర్వ విద్యార్థి. అతను నగరంలోని కాగ్నిటా స్కూల్ గ్రూప్లో ఫైనాన్స్ ప్రొఫెషనల్గా ఉద్యోగం చేస్తున్నాడు.
“నీరాజ్ రెండేళ్ల క్రితం రాజస్థాన్లో వివాహం చేసుకున్నాడు. మినా రోడ్ వాస్ల్ కమ్యూనిటీలో నివసిస్తున్నాడు. అతని మృతదేహాన్ని ఇప్పుడు జైపూర్కు తరలిస్తున్నారు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి.” అని బంధువు తెలిపారు. కాగా, నీరాజ్ స్నేహితులు కొంతమంది కూడా వివాహం కోసం భారతదేశానికి వెళ్లి ఆ తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. నీరాజ్ జంట మాత్రం సెలవుల కోసం పహల్గామ్కు వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని నీరజ్ స్నేహితులు వాపోయారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్