భార్యతో కలిసి సెలవులకు వెళ్లగా.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దుబాయ్ ప్రవాసి మృతి..!!
- April 24, 2025
యూఏఈ: మంగళవారం పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో దుబాయ్లో నివసిస్తున్న, పనిచేస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసి కూడా ఉన్నట్లు గుర్తించారు. అతని మరణాన్ని దగ్గరి బంధువు ధృవీకరించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన నీరాజ్ ఉధ్వాని తన భార్యతో కలిసి సెలవులకు కాశ్మీర్ వెళ్లాడు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లో స్నేహితుడి వివాహం కోసం భారతదేశానికి వెళ్లినట్లు మృతుడి బంధువు తెలిపారు.
నీరాజ్ జైపూర్కు చెందినవాడు. చాలా కాలంగా దుబాయ్లో నివసిస్తున్నాడు. అతను ఇండియన్ హై స్కూల్లో పూర్వ విద్యార్థి. అతను నగరంలోని కాగ్నిటా స్కూల్ గ్రూప్లో ఫైనాన్స్ ప్రొఫెషనల్గా ఉద్యోగం చేస్తున్నాడు.
“నీరాజ్ రెండేళ్ల క్రితం రాజస్థాన్లో వివాహం చేసుకున్నాడు. మినా రోడ్ వాస్ల్ కమ్యూనిటీలో నివసిస్తున్నాడు. అతని మృతదేహాన్ని ఇప్పుడు జైపూర్కు తరలిస్తున్నారు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి.” అని బంధువు తెలిపారు. కాగా, నీరాజ్ స్నేహితులు కొంతమంది కూడా వివాహం కోసం భారతదేశానికి వెళ్లి ఆ తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. నీరాజ్ జంట మాత్రం సెలవుల కోసం పహల్గామ్కు వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని నీరజ్ స్నేహితులు వాపోయారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







