పాకిస్థాన్ తో అన్ని సంబంధాలు కట్–భారత్ సంచలన నిర్ణయాలు
- April 24, 2025
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ అత్యంత కఠినమైన నిర్ణయాలను తీసుకుంది.ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది తీవ్రంగా గాయపడడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉగ్రదాడికి పాల్పడిన వారికి పాక్ సంబంధాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ భేటీలో పాకిస్థాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
పాకిస్థాన్తో పూర్తిగా దౌత్య సంబంధాలు పూర్తిగా కట్
ఈ నిర్ణయాల ప్రకారం, భారత్ తన దౌత్య సంబంధాలను పాకిస్థాన్తో పూర్తిగా తెంచుకుంది. పాక్కు చెందిన పౌరులు, పర్యాటకులు రెండు రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పాకిస్థాన్ పౌరులకు భారత్లో ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. అంతేగాక, అటారీ చెక్పోస్టును తక్షణమే మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. పాక్ హైకమిషనర్ను కూడా భారత్ విడిచిపోవాలని సూచించడం, రెండు దేశాల మధ్య ఉన్న ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడమూ భారత దిగ్గజ నిర్ణయాల్లో భాగంగా నిలిచాయి.
పహల్గాం దాడి పిరికిపంద చర్య
ఈ చర్యలపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టతనిచ్చారు. పహల్గాం దాడి పిరికిపంద చర్యగా ప్రపంచ దేశాల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. భారత్ ఈ దాడికి తగిన బదులు ఇచ్చే దిశగా ముందుకెళ్తోందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. త్వరలోనే ఉగ్రవాదుల పైనా, వాటికి మద్దతిచ్చే దేశాలపైనా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచే విధంగా భారత్ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







