రేపే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు..పాల్గొననున్న భారత రాష్ట్రపతి
- April 25, 2025
న్యూఢిల్లీ: వాటికన్ సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి వెళ్లారు. ఈ నెల 26వ తేదిన జరిగే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో ఆమె పాల్గొనున్నారు. ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా వెళ్లారు.వాటికన్ వెళ్తున్న బృందంలో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ పీటర్ డిసౌజా ఉన్నారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు. వాటికన్లోని సెయింట్ పీటర్ బాలిసికా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోప్ ఫ్రాన్సిస్కు ముర్ము నివాళి అర్పిస్తారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరగనున్న సామూహిక ప్రార్థనల్లోనూ ఆమె పాల్గొననున్నారు. ఇక అంత్యక్రియలు జరిగే 26వ తేదిన సంతాప దినంగా పాటించనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









