రేపే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు..పాల్గొననున్న భారత రాష్ట్రపతి
- April 25, 2025
న్యూఢిల్లీ: వాటికన్ సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి వెళ్లారు. ఈ నెల 26వ తేదిన జరిగే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో ఆమె పాల్గొనున్నారు. ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా వెళ్లారు.వాటికన్ వెళ్తున్న బృందంలో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ పీటర్ డిసౌజా ఉన్నారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు. వాటికన్లోని సెయింట్ పీటర్ బాలిసికా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోప్ ఫ్రాన్సిస్కు ముర్ము నివాళి అర్పిస్తారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరగనున్న సామూహిక ప్రార్థనల్లోనూ ఆమె పాల్గొననున్నారు. ఇక అంత్యక్రియలు జరిగే 26వ తేదిన సంతాప దినంగా పాటించనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









