బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..డ్రైవర్ కు BD49,500 ఫైన్..!!
- April 27, 2025
మనామా: ఓ డ్రైవర్ తెల్లవారుజామున షిఫ్ట్ సమయంలో సిగ్నల్ జంప్ చేసి ముగ్గురు రోడ్ వర్కర్లపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి మొత్తం BD49,500 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆసియన్ జాతీయులైన కార్మికులు అందరూ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డులో కొంత భాగాన్ని తవ్వుతుండగా జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ పూర్తిగా బాధ్యుడని హై సివిల్ కోర్టు నిర్ధారించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం, డ్రైవర్ సిగ్నల్ను జంప్ చేసి, చట్టబద్ధంగా గ్రీన్ లైట్ దాటుతున్న మరొక వాహనాన్ని ఢీకొట్టి, ఆపై దారి తప్పి, కార్మికులపైకి దూసుకెళ్లింది. మరణించిన కార్మికుడి కుటుంబానికి BD36,000, ప్రాణనష్టానికి BD15,000లతోపాటు ఆర్థిక నష్టాలకు BD21,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని మృతుని తల్లి, భార్య, చిన్న కుమార్తె మధ్య సమానంగా విభజించాలని, వారు పూర్తిగా అతని ఆదాయంపై ఆధారపడి ఉన్నారని కోర్టు తన తీర్పులో వెల్లడిచింది. గాయపడ్డ ఒక కార్మికునికి గాయాలకు BD17,500, వైద్య ఖర్చులు ఇతర ఖర్చుల కోసం BD1,000 లభించింది. మూడవ కార్మికుడు BD3,500 పరిహారం అందుకున్నాడు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







