బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..డ్రైవర్ కు BD49,500 ఫైన్..!!
- April 27, 2025
మనామా: ఓ డ్రైవర్ తెల్లవారుజామున షిఫ్ట్ సమయంలో సిగ్నల్ జంప్ చేసి ముగ్గురు రోడ్ వర్కర్లపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి మొత్తం BD49,500 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆసియన్ జాతీయులైన కార్మికులు అందరూ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డులో కొంత భాగాన్ని తవ్వుతుండగా జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ పూర్తిగా బాధ్యుడని హై సివిల్ కోర్టు నిర్ధారించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం, డ్రైవర్ సిగ్నల్ను జంప్ చేసి, చట్టబద్ధంగా గ్రీన్ లైట్ దాటుతున్న మరొక వాహనాన్ని ఢీకొట్టి, ఆపై దారి తప్పి, కార్మికులపైకి దూసుకెళ్లింది. మరణించిన కార్మికుడి కుటుంబానికి BD36,000, ప్రాణనష్టానికి BD15,000లతోపాటు ఆర్థిక నష్టాలకు BD21,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని మృతుని తల్లి, భార్య, చిన్న కుమార్తె మధ్య సమానంగా విభజించాలని, వారు పూర్తిగా అతని ఆదాయంపై ఆధారపడి ఉన్నారని కోర్టు తన తీర్పులో వెల్లడిచింది. గాయపడ్డ ఒక కార్మికునికి గాయాలకు BD17,500, వైద్య ఖర్చులు ఇతర ఖర్చుల కోసం BD1,000 లభించింది. మూడవ కార్మికుడు BD3,500 పరిహారం అందుకున్నాడు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!