తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
- April 27, 2025
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటారు. దీంతో ప్రతీ వేసవికాలం సెలవుల్లో రెండు నెలలు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘వేసవికాలం రెండు నెలలు వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మే, జూన్ రెండు నెలలపాటు సెలవుల నేపథ్యంలో కుటుంబాలతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, భక్తులు ఇబ్బందులు పడకూదడనే ఉద్దేశంతోనే మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు.’’
వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులతో శ్రీవారి మెట్టు మార్గంలో శనివారం తెల్లవారు జామునుంచే ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు గరుడ సర్కిల్ వరకు బారులు తీరాయి.
మరోవైపు.. జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. జీఎన్సీ టోల్ గేట్, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. భక్తుల పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు.. వాహనాలు, భక్తుల లగేజీలను పరిశీలించి పంపుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!







