మస్కట్లో మే 3న ఇరాన్-అమెరికా మూడో రౌండ్ చర్చలు..!!
- April 27, 2025
మస్కట్ : ఇరాన్, అమెరికా మధ్య శనివారం మస్కట్లో మూడో రౌండ్ ఉన్నత స్థాయి అణు చర్చలు ముగిశాయి. తదుపరి రౌండ్ చర్చల కోసం మే 3న రెండు వర్గాలు మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించాయి. సమావేశం తర్వాత, ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది మాట్లాడుతూ.. "శనివారం జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు పరస్పర గౌరవం, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఉమ్మడి ఆకాంక్షను గుర్తించాయి. ప్రధాన సూత్రాలు, లక్ష్యాలు,ఆందోళనలన్నీ పరిష్కరించబడ్డాయి. మే 3న తాత్కాలికంగా జరగనున్న మరో ఉన్నత స్థాయి సమావేశంతో వచ్చే వారం చర్చలు కొనసాగుతాయి." అని అన్నారు.
ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది సమక్షంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ చర్చలలో పాల్గొన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం, టెహ్రాన్పై ఆంక్షల తొలగింపుపై ఒక ఒప్పందానికి రావడానికి ఇరాన్, అమెరికా గత రెండు వారాల్లో ఒమన్, ఇటలీలో రెండు రౌండ్ల చర్చలు జరిపాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే









