అల్ బురైమి గవర్నరేట్ లో పర్యాటకాన్ని పెంచడంపై సమీక్ష..!!
- April 29, 2025
అల్ బురైమి: అల్ బురైమి గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్ అనేక అభివృద్ధి, సేవలకు సంబంధించిన అంశాలపై చర్చించింది. ముఖ్యంగా పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సహజ వనరులలో పెట్టుబడి, గవర్నరేట్లోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అల్ బురైమి గవర్నర్, కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ డాక్టర్ హమద్ అహ్మద్ అల్ బుసైది అధ్యక్షత వహించిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. సమావేశంలో పర్యావరణ పెట్టుబడి అవకాశాలను, గవర్నరేట్లో స్థిరమైన పర్యాటకానికి మద్దతు ఇవ్వడానికి సహజ ఆస్తులను ఉపయోగించడం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
2024లో అల్ బురైమిలో వ్యవసాయం, జల వనరుల డైరెక్టరేట్ జనరల్ సాధించిన కీలక విజయాలను ఈ సమావేశం సమీక్షించింది. అల్ బురైమిలోని విలాయత్లో వర్షపు నీటి పారుదల ప్రాజెక్టు కోసం ఒక ప్రత్యేక సంస్థ నిర్వహిస్తున్న కన్సల్టెన్సీ అధ్యయనంపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- భారతీయులు శ్రీలంకకు ఉచితంగా వెళ్లవచ్చు..
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?









