ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- July 12, 2026
దోహా: ఇరాన్ జరిపిన దాడులను ఖతార్ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే, ఈ ఆపరేషన్ల కారణంగా ఆకాశం నుండి కిందపడిన శకలాల (debris) వల్ల ఒక చిన్నారి సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) వెల్లడించింది. గాయపడిన వారికి ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నది.
అలాగే, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల అనంతరం భద్రతా బలగాలు, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొంది. ప్రజా రక్షణ కోసం అదనపు ముందస్తు జాగ్రత్తలు అవసరమైనప్పుడు మాత్రమే జాతీయ ప్రజా భద్రతా హెచ్చరికలు (Emergency Alerts) జారీ చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు, ధృవీకరించని సమాచారం, వీడియోలు లేదా ఫోటోలను షేర్ చేయవద్దని... కేవలం అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలను కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రజల భద్రత కోసం భద్రతా విభాగాలు నిరంతరాయంగా, పూర్తి అప్రమత్తతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







