పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- July 12, 2026
మస్కట్: ఒమన్ సముద్ర తీరంలో 'జీఎఫ్ఎస్ గెలాక్సీ' (GFS Galaxy) నౌక ప్రమాదానికి గురైన ఘటనలో పది మంది భారతీయ సిబ్బందిని ఒమన్ అధికారులు సురక్షితంగా రక్షించారు. అయితే, మరో భారతీయ పౌరుడు గల్లంతైనట్లు మస్కట్లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) వెల్లడించింది.
ఈ ప్రమాద సంఘటనపై తాము నిరంతరం నిఘా ఉంచామని, ఒమన్ అధికారులు, నౌక యాజమాన్యం మరియు ఇతర సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొంది. ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







