బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- July 12, 2026
అబూదాబి: బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) విడుదల చేసిన ప్రకటనలో, ఈ దాడులు సోదర దేశాల సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, వాటి భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా ఉన్నాయని పేర్కొంది.
బహ్రెయిన్, కువైట్, ఖతార్ , హషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఒమాన్ సుల్తానేట్లకు యూఏఈ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. ఆయా దేశాల భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు వారు చేపడుతున్న అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడం అత్యంత కీలకమని యూఏఈ పునరుద్ఘాటిస్తూ, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపు నిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







