బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- July 12, 2026
అబూదాబి: బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) విడుదల చేసిన ప్రకటనలో, ఈ దాడులు సోదర దేశాల సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, వాటి భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా ఉన్నాయని పేర్కొంది.
బహ్రెయిన్, కువైట్, ఖతార్ , హషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఒమాన్ సుల్తానేట్లకు యూఏఈ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. ఆయా దేశాల భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు వారు చేపడుతున్న అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడం అత్యంత కీలకమని యూఏఈ పునరుద్ఘాటిస్తూ, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపు నిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







