అక్కడ సౌర విద్యుత్తు కేవలం 2.20 రూపాయలే.!
- July 08, 2016
దుబాయ్లో సౌరవిద్యుత్ ఉత్పాదన చేసేందుకు ఉత్పత్తిదారులు యూనిట్కు రూ. 2.2కే (2.99సెంట్లు) ముందుకురావడం రికార్డు సృష్టించింది. అయితే భారత్లో మాత్రం ఇంత తక్కువకు ఉత్పత్తిదారులు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజస్థాన్లో 70 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రానికి ఫిన్లాండ్కు చెందిన ఒక కంపెనీ యూనిట్కు రూ. 4.34తో టెండర్ దాఖలు చేసింది. మనదేశంలో ఇదే అత్యంత తక్కువ ధర కావడం గమనార్హం. దీనిపై విద్యుత్ రంగనిపుణులు విశ్లేషిస్తూ దుబాయ్లో పన్ను రాయితీలు భారీగా వుంటాయని తెలిపారు. దీంతో పాటు అక్కడ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ కావడంతో ఒక మెగావాట్ ప్లాంట్ 20 లక్షల యూనిట్ల విద్యుత్ను తయారుచేస్తుందని అదే భారత్లో మాత్రం 16 లక్షల యూనిట్లు మాత్రమేనన్నారు. దుబాయ్ ప్రభుత్వం అక్కడ సౌరవిద్యుత్ కేంద్రాలకు భారీ రాయితీలు కల్పించడం కూడా అక్కడ సౌరవిద్యుత్ చవక ధరలో ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







