అబ్బాసియా అపార్ట్‌మెంట్‌లో భారతీయ జంట మృతి..!!

- May 02, 2025 , by Maagulf
అబ్బాసియా అపార్ట్‌మెంట్‌లో భారతీయ జంట మృతి..!!

కువైట్: అబ్బాసియాలోని వారి అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక భారతీయ జంట మృతి చెంది కనిపించారు. మృతులను సూరజ్, బిన్సీగా గుర్తించారు. ఇద్దరూ కేరళలోని ఎర్నాకుళానికి చెందినవారు. సూరజ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. బిన్సీ రక్షణ మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.  

పోలీసుల కథనం ప్రకారం.. ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వారు ఇటీవల కువైట్‌కు తిరిగి రాకముందు తమ ఇద్దరు పిల్లలను భారతదేశానికి పంపారని కూడా తెలిసింది. ఈ సంఘటనపై ప్రస్తుతం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు కువైట్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com