రష్యా దౌత్యవేత్తలను అమెరికా వెలివేసింది..
- July 09, 2016
అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇద్దరు రష్యా దౌత్యవేత్తలను అమెరికా వెలివేసింది. ఇటీవల మాస్కోలో అమెరికా దౌత్యవేత్తపై స్థానిక పోలీస్ దాడి చేశాడు. ఆ దాడికి నిరసనగా ఇద్దరు రష్యా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలని గత నెల 17వ తేదీన ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రభుత్వ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే వాళ్ల పేర్లను వెల్లడించేందుకు మాత్రం అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ నిరాకరించారు. మాస్కోలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం దగ్గర ఓ దౌత్యవేత్తపై రష్యా పోలీస్ చేయి చేసుకున్నాడు. అయితే ఆ దౌత్యవేత్త అమెరికా నిఘా సంస్థ సీఐఏకు పనిచేస్తున్నట్లు రష్యా ఆరోపిస్తోంది. తన ఆధార పత్రాలను చూపించాలని కోరినప్పుడు అతను నిరాకరించాడని, దాంతో అతనిపై రష్యా పోలీస్ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 6వ తేదీన ఆ ఘటన జరిగింది. అమెరికా దౌత్యవేత్త, రష్యా పోలీస్ మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను కూడా తాజాగా రిలీజ్ చేశారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







