అట్టహాసంగా మొదలైన 'ఆటా' మహాసభలు
- July 09, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా) మహా సభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని డెట్రాయిట్ నగరం వేదికగా ఇవాళ తొలి రోజు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ మహా సభలకు పెద్ద ఎత్తున అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు తరలి వచ్చారు. తెలంగాణ నుంచి కూడా పలువురు నేతలు, కవులు, కళాకారులు హాజరయ్యారు. మొదటి రోజు వేడుకల్లో తెలంగాణ జానపద కళాకారులు ఆటాపాటలతో హోరెత్తించారు. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలతో సభను అలరింపజేశారు. ఎంపీ జితేందర్ రెడ్డి కూడా వీరితో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఎంపీలు జితేందర్రెడ్డి, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సాంస్కృతిక రథ సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాంస్కృతిక సారథి బృందం సభ్యులు, యాంకర్ మంగ్లీ పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తమవంతు పాత్రను పోషించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎన్నారైల పాత్ర మరవలేదని కొనియాడారు.
తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తమ వంతు పాత్రను పోషించాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కోరారు. అమెరికాలో ఉన్న తెలంగాణవాసులంతా ఒకే వేదికపై కలుసుకునేలా ఏర్పాట్లు చేసిన ఆటా నిర్వాహకులను ఆయన అభినందించారు. మనకంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







