యూఏఈకి అనుకూలంగా తీర్పునిచ్చిన ప్రపంచ కోర్టు..!!
- May 06, 2025
యూఏఈ: డార్ఫర్ జోక్యంపై యూఏఈకి వ్యతిరేకంగా సూడాన్ దాఖలు చేసిన జాతి నిర్మూలన కేసును ప్రపంచ కోర్టు కొట్టివేసిందని ICJ సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై తీర్పు చెప్పే అధికారం తమకు లేదని చెబుతూ, కేసును కొట్టివేసినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది.
అధికార పరిధి లేకపోవడం వల్ల కేసును కొట్టివేయాలన్న ICJ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు యూఏఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం ఆధారంగా, కేసును కోర్టు రిజిస్ట్రీ నుండి తొలగిస్తారు. సంబంధిత అన్ని చర్యలు అధికారికంగా ముగుస్తాయి.
2023 నుండి సూడాన్ సైన్యంతో పోరాడుతున్న పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కు ఆయుధాలను సరఫరా చేస్తోందని వాదిస్తూ, హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సూడాన్ యూఏఈపై కేసు దాఖలు చేసింది. కాగా, తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను యూఏఈ ఖండించింది. వేలాది మందిని బలిగొన్న యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల నుండి దృష్టి మరల్చే "రాజకీయ నాటకం"గా సూడాన్ కేసును తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









