పెరిగిన వెండి ధర

- July 09, 2016 , by Maagulf
పెరిగిన వెండి ధర

నేటి బులియన్‌ మార్కెట్లో వెండి ధర బాగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.800 పెరిగి రూ.46,300కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ బాగా ఉండడంతో వెండి ధర చుక్కలు చూస్తోంది. అయితే బంగారం ధర వరుసగా మూడో రోజూ తగ్గింది. పది గ్రాముల పసిడి రూ.150 తగ్గి రూ.30,700కు చేరింది. ఇటీవల పదిగ్రాముల బంగారం రూ.31వేల పైకి చేరిన తర్వాత వరుసగా మూడు రోజుల్లో రూ.350 తగ్గింది. పుత్తడి ధర విపరీతంగా పెరిగిన కారణంగా నగల వర్తకులు, వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి, బంగారం ధరలు పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com