గాంధీ మార్గంలో మోడీ

- July 09, 2016 , by Maagulf
గాంధీ మార్గంలో మోడీ

ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం డర్బన్‌ వరకు రైలులో ప్రయాణించారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణించిన రైలు మార్గంలోనే నేడు మోదీ ప్రయాణించారు. పెంట్రిచ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ వరకు పలువురు ఆఫ్రికన్‌ అధికారులతో మోదీ రైల్లో వెళ్లారు. 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణించినప్పుడు జాతివివక్ష కారణంగా రైల్లో నుంచి దించేసిన చారిత్రక ఘటన జ్ఞాపకార్థం మోదీ అదే మార్గంలో రైలులో ప్రయాణం చేశారు. రైల్లో నుంచి దించేసిన ఘటనే గాంధీని జాతివివక్షపై పోరాటం దిశగా నడిపించిన సంగతి తెలిసిందే.
ఆఫ్రికాలో నాలుగు దేశాల్లో పర్యటన నిమిత్తం వెళ్లిన మోదీ జొహన్నెస్‌బర్గ్‌ నుంచి ఈరోజు ఉదయం డర్బన్‌ చేరుకున్నారు. అంతకుముందే మోదీ దక్షిణాఫ్రికాలో భారత సంతతి వారితో సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. దక్షిణాఫ్రికాను మహాత్మాగాంధీ భూమిగా అభివర్ణించారు. ఈ దేశమే మోహనదాస్‌ కరమ్‌చంద్‌ గాంధీని మహాత్మా గాంధీగా మార్చిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com