గాంధీ మార్గంలో మోడీ
- July 09, 2016
ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం డర్బన్ వరకు రైలులో ప్రయాణించారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణించిన రైలు మార్గంలోనే నేడు మోదీ ప్రయాణించారు. పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్మారిట్జ్బర్గ్ వరకు పలువురు ఆఫ్రికన్ అధికారులతో మోదీ రైల్లో వెళ్లారు. 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణించినప్పుడు జాతివివక్ష కారణంగా రైల్లో నుంచి దించేసిన చారిత్రక ఘటన జ్ఞాపకార్థం మోదీ అదే మార్గంలో రైలులో ప్రయాణం చేశారు. రైల్లో నుంచి దించేసిన ఘటనే గాంధీని జాతివివక్షపై పోరాటం దిశగా నడిపించిన సంగతి తెలిసిందే.
ఆఫ్రికాలో నాలుగు దేశాల్లో పర్యటన నిమిత్తం వెళ్లిన మోదీ జొహన్నెస్బర్గ్ నుంచి ఈరోజు ఉదయం డర్బన్ చేరుకున్నారు. అంతకుముందే మోదీ దక్షిణాఫ్రికాలో భారత సంతతి వారితో సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. దక్షిణాఫ్రికాను మహాత్మాగాంధీ భూమిగా అభివర్ణించారు. ఈ దేశమే మోహనదాస్ కరమ్చంద్ గాంధీని మహాత్మా గాంధీగా మార్చిందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







