పేగులలో దాచి కొకైన్ స్మగ్లింగ్.. పట్టుబడ్డ ప్రయాణీకుడు..!!
- May 18, 2025
Image for illustration purpose only..
యూఏఈ: అబుదాబి విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుడి పేగుల నుండి సుమారు 1,198 గ్రాముల బరువు, 5 మిలియన్ల దిర్హామ్ల విలువ కలిగిన ఎనభై తొమ్మిది కొకైన్ గుళికలను స్వాధీనం చేసుకున్నారు. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICAPC)లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది.
దక్షిణ అమెరికా దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడిపై విమానాశ్రయంలోని కస్టమ్స్ తనిఖీ బృందానికి అనుమానం కలిగింది. దాంతో అతడిని అధునాతన స్కానింగ్ పరికరాలతో స్కానింగ్ చేయగా, అతని శరీరం లోపల గుర్తు తెలియని గుళికలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్య నిఫుణుల సాయంతో అతని పేగుల నుండి 89 గుళికలను బయటకు తీశారు. ఇన్స్పెక్టర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించినందుకు అథారిటీ అభినందించింది.
గత వారం, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన నమోదైంది. స్మగ్లింగ్ మార్గాలను నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









