పేగులలో దాచి కొకైన్ స్మగ్లింగ్.. పట్టుబడ్డ ప్రయాణీకుడు..!!
- May 18, 2025
Image for illustration purpose only..
యూఏఈ: అబుదాబి విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుడి పేగుల నుండి సుమారు 1,198 గ్రాముల బరువు, 5 మిలియన్ల దిర్హామ్ల విలువ కలిగిన ఎనభై తొమ్మిది కొకైన్ గుళికలను స్వాధీనం చేసుకున్నారు. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICAPC)లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది.
దక్షిణ అమెరికా దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడిపై విమానాశ్రయంలోని కస్టమ్స్ తనిఖీ బృందానికి అనుమానం కలిగింది. దాంతో అతడిని అధునాతన స్కానింగ్ పరికరాలతో స్కానింగ్ చేయగా, అతని శరీరం లోపల గుర్తు తెలియని గుళికలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్య నిఫుణుల సాయంతో అతని పేగుల నుండి 89 గుళికలను బయటకు తీశారు. ఇన్స్పెక్టర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించినందుకు అథారిటీ అభినందించింది.
గత వారం, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన నమోదైంది. స్మగ్లింగ్ మార్గాలను నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







