అతి వేగం: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- July 10, 2016
35 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ స్ట్రీట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి కంట్రోల్ తప్పడంతో, అతి వేగంతో ఉన్న కారు ప్రమాదానికి కారణమయ్యింది. ప్రమాద సమాచారం అందగానే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతి చెందగా, ఆ మృతదేహాన్ని అజ్మన్లోని ఖలీఫా హాస్పిటల్కి తరలించారు. మరో ప్రమాదంలో డీజిల్ ట్రక్, ఎమిరేట్స్ రోడ్పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రోడ్లపై వేగాన్ని తగ్గించుకోవాలనీ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాహనాలు నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







