రాష్ట్రపతి చేతుల మీదుగా సైనికులకు పురస్కారలు!

- May 22, 2025 , by Maagulf
రాష్ట్రపతి చేతుల మీదుగా సైనికులకు పురస్కారలు!

న్యూఢిల్లీ: దేశ భద్రతకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా సేవలందించిన భారత సైనికులను సత్కరించేందుకు…కేంద్ర ప్రభుత్వం శౌర్య‌ పురస్కారాలను అంద‌జేస్తుంది. ఈ సందర్భంగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో శౌర్య పురస్కారాల ప్రదానోత్సవం నేడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, త్రివిద‌ సైన్యాధినేతలతో సహా..ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.వివిధ విభాగాల్లో దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు రాష్ట్రపతి శౌర్య అవార్డులు ప్రదానం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com