ఒమన్ లో ప్రారంభమైన IMF మిషన్..!!
- May 23, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సిబ్బంది మిషన్ ప్రారంభమైంది. వారి పర్యటన మే 29 వరకు కొనసాగుతుంది. ఈ సందర్శన IMF సాధారణ ఆర్టికల్ IV లో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO), ఆర్థిక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు.
ఈ మిషన్ సమయంలో IMF బృందం CBO, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు, నిపుణులతో వరుస సమావేశాలను నిర్వహిస్తుంది.ఈ సందర్భంగా ఇటీవలి ఆర్థిక, ద్రవ్య పరిణామాలు.. ముఖ్యంగా పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ధోరణులపై చర్చిస్తారు.అదే సమయంలో ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గులు, వాణిజ్యంపై ప్రభావం వంటి కీలక అంశాలను కూడా కవర్ చేస్తారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!









