బహ్రెయిన్లో కొత్త బస్ ఫేర్స్
- July 11, 2016
బహ్రెయిన్లో బస్ ఫేర్స్ని సవరించారు. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఈ వివరాల్ని వెల్లడించింది. కొత్త బస్ ఛార్జీలు జులై 13 నుంచి అమల్లోకి వస్తాయి. సింగిల్ ట్రిప్కి దూరంతో సంబందం లేకుండా 250 ఫిల్స్ వసూలు చేయనున్నారు. డైలీ పాస్ కోసం 600 ఫిల్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 2015లో బహ్రెయిన్ కొత్త పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. బహ్రెయిన్ వ్యాప్తంగా 32 రూట్లలో కొత్త ప్రాంతాలకు ఈ బస్సుల్ని ఆపరేట్ చేస్తున్నారు. అప్పటినుంచి రోజువారీ పాస్లను 500 ఫిల్స్కే అందించారు. ప్రమోషనల్ పీరియడ్ కోసం ఈ చార్జీలను నిర్ణయించారు. అయితే ప్రమోషనల్ పీరియడ్ ముగియడంతో బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కొత్త ధరలను ప్రకటించింది. 28 రోజులకుగాను నెలవారీ పాస్ (గో కార్డ్) ధర 14 బహ్రెయినీ దినార్స్. గోకార్డ్ అలాగే పేపర్ టిక్కెట్ల రూపంలో టిక్కెట్లు లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







