యూఏఈలో కొత్త వాతావరణ చట్టం..Dh2 మిలియన్ల జరిమానా..!!
- May 30, 2025
యూఏఈ: యూఏఈలో కొత్త వాతావరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.MENA ప్రాంతంలో వాతావరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి దేశంగా అవతరించింది. కొత్త చట్టం ప్రకారం.. ఉద్గారాల జాబితాలు, మూడవ పక్ష ఆడిట్లు, జాతీయ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ను తయారు చేయడం తప్పనిసరి. చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh500,00 నుండి Dh2 మిలియన్ల వరకు జరిమానాలు విధిస్తారు. అలాగే, నేషనల్ కార్బన్ క్రెడిట్ రిజిస్ట్రీ యూఏఈని అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లతో అనుసంధానించడానికి కూడా సిద్ధంగా ఉంది.
దుబాయ్లోని కొచ్చర్ & కో ఇంక్ లీగల్ కన్సల్టెంట్స్ సీనియర్ అసోసియేట్ నవన్దీప్ మట్టా మాట్లాడుతూ.. చట్టం ఒక సంవత్సరం గ్రేస్ పీరియడ్ను అందిస్తుందని, పరిశ్రమలు సర్దుబాటు చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. క్లైమేట్-సంబంధిత నష్టాలపై డేటా-షేరింగ్ వంటి వాతావరణ ప్రణాళికలను కొత్త చట్టం తప్పనిసరి చేసింది.
ఇదిలా ఉండగా, గ్రీన్పీస్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (మెనా) కొత్త యూఏఈ చట్టాన్ని ప్రశంసించింది. ఇది స్థిరమైన భవిష్యత్తు వైపు ఒక పరివర్తనాత్మక అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!







