యూఏఈలో కొత్త వాతావరణ చట్టం..Dh2 మిలియన్ల జరిమానా..!!
- May 30, 2025
యూఏఈ: యూఏఈలో కొత్త వాతావరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.MENA ప్రాంతంలో వాతావరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి దేశంగా అవతరించింది. కొత్త చట్టం ప్రకారం.. ఉద్గారాల జాబితాలు, మూడవ పక్ష ఆడిట్లు, జాతీయ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ను తయారు చేయడం తప్పనిసరి. చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh500,00 నుండి Dh2 మిలియన్ల వరకు జరిమానాలు విధిస్తారు. అలాగే, నేషనల్ కార్బన్ క్రెడిట్ రిజిస్ట్రీ యూఏఈని అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లతో అనుసంధానించడానికి కూడా సిద్ధంగా ఉంది.
దుబాయ్లోని కొచ్చర్ & కో ఇంక్ లీగల్ కన్సల్టెంట్స్ సీనియర్ అసోసియేట్ నవన్దీప్ మట్టా మాట్లాడుతూ.. చట్టం ఒక సంవత్సరం గ్రేస్ పీరియడ్ను అందిస్తుందని, పరిశ్రమలు సర్దుబాటు చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. క్లైమేట్-సంబంధిత నష్టాలపై డేటా-షేరింగ్ వంటి వాతావరణ ప్రణాళికలను కొత్త చట్టం తప్పనిసరి చేసింది.
ఇదిలా ఉండగా, గ్రీన్పీస్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (మెనా) కొత్త యూఏఈ చట్టాన్ని ప్రశంసించింది. ఇది స్థిరమైన భవిష్యత్తు వైపు ఒక పరివర్తనాత్మక అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







