యూఏఈలో కొత్త వాతావరణ చట్టం..Dh2 మిలియన్ల జరిమానా..!!
- May 30, 2025
యూఏఈ: యూఏఈలో కొత్త వాతావరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.MENA ప్రాంతంలో వాతావరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి దేశంగా అవతరించింది. కొత్త చట్టం ప్రకారం.. ఉద్గారాల జాబితాలు, మూడవ పక్ష ఆడిట్లు, జాతీయ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ను తయారు చేయడం తప్పనిసరి. చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh500,00 నుండి Dh2 మిలియన్ల వరకు జరిమానాలు విధిస్తారు. అలాగే, నేషనల్ కార్బన్ క్రెడిట్ రిజిస్ట్రీ యూఏఈని అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లతో అనుసంధానించడానికి కూడా సిద్ధంగా ఉంది.
దుబాయ్లోని కొచ్చర్ & కో ఇంక్ లీగల్ కన్సల్టెంట్స్ సీనియర్ అసోసియేట్ నవన్దీప్ మట్టా మాట్లాడుతూ.. చట్టం ఒక సంవత్సరం గ్రేస్ పీరియడ్ను అందిస్తుందని, పరిశ్రమలు సర్దుబాటు చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. క్లైమేట్-సంబంధిత నష్టాలపై డేటా-షేరింగ్ వంటి వాతావరణ ప్రణాళికలను కొత్త చట్టం తప్పనిసరి చేసింది.
ఇదిలా ఉండగా, గ్రీన్పీస్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (మెనా) కొత్త యూఏఈ చట్టాన్ని ప్రశంసించింది. ఇది స్థిరమైన భవిష్యత్తు వైపు ఒక పరివర్తనాత్మక అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









