గోల్డ్ లోన్స్ పై రూల్స్..కేంద్రం కీలక సూచనలు
- May 31, 2025
న్యూ ఢిల్లీ: బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే చిన్న రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.రూ.2 లక్షలలోపు గోల్డ్ లోన్ తీసుకునేవారికి కొత్త నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేలా RBIకి కేంద్ర ఆర్థిక శాఖ సూచనలు పంపింది.ఇది చిన్న రైతులు, వ్యాపారులు, మహిళల కోసం ఒక శుభవార్తగా మారింది.
2026 జనవరి 1 నుంచి మినహాయింపు అమలు
ఈ మినహాయింపు 2026 జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. అంటే అప్పటి వరకు ఇప్పటికే ఉన్న నిబంధనలు కొనసాగుతాయి.ఈ నిర్ణయం కారణంగా చిన్న మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి డాక్యుమెంటేషన్, వాల్యుయేషన్, ఇతర నిబంధనల భారం తగ్గనుంది.బ్యాంకుల పనితీరు వేగవంతం కావడం ద్వారా వినియోగదారులకు కూడా త్వరిత రుణ లభ్యత కుదురనుంది.
గతంలో రుణ పరిమితిపై కఠిన నిబంధనలు విధించిన RBI
గత ఏడాది ఆగస్టులో తాకట్టు పెట్టిన బంగారం విలువలో గరిష్ఠంగా 75% వరకు మాత్రమే రుణం ఇవ్వాలన్న నిబంధనను RBI ప్రవేశపెట్టింది.దీనివల్ల చాలా మంది చిన్న రుణగ్రహీతలకు నష్టమవుతోంది.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, చిన్న మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి మరింత సౌలభ్యం కలిగించనుంది.బ్యాంకులు కూడా దీనికి అనుగుణంగా విధానాలను సడలించనున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







