UPS కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు
- May 31, 2025
న్యూ ఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో సభ్యులుగా ఉన్న రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు మరో శుభవార్త. ప్రభుత్వం నూతనంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద అదనపు ప్రయోజనాలు అందించేందుకు ముందుకు వచ్చింది.కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి, 2025 మార్చి 31వ తేదీకి ముందే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయి.ఇది ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయంగా భావిస్తున్నారు.
బేసిక్, డీఏలలో పదోవంతు తక్షణ లాభం
ఈ స్కీమ్ కింద ఉద్యోగులు తమ సర్వీస్ చివర్లో పొందిన బేసిక్ పే మరియు డీఏలలో పదో వంతు మొత్తాన్ని తక్షణమే పొందే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా, మూలవేతన సగటులో 50 శాతం పెన్షన్ కల్పించనున్నారు. ఇది NPS కింద ఉన్న ఉద్యోగులకి ఒకింత ఊరట కలిగించే అంశంగా నిలుస్తుంది. పెన్షన్ లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఇది ఆర్థికంగా కొంత భరోసా కలిగించనుంది.
జూన్ 30లోగా దరఖాస్తు తప్పనిసరి
ఈ అదనపు ప్రయోజనాలను పొందాలంటే ఆసక్తి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.ఇందుకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు విధానం సంబంధించిన అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత శాఖల కార్యాలయాల ద్వారా పొందవచ్చు.కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం ఎంతోమంది పింఛన్ దారులకు కొత్త ఆశను కలిగించింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









