యూఏఈలో కొత్త మీడియా చట్టం...నిబంధనలు ఉల్లంఘిస్తే Dh1 మిలియన్ వరకు జరిమానా
- June 04, 2025
యూఏఈ: యూఏఈలో మే 29 నుండి కొత్త మీడియా చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం అన్ని రకాల మీడియా కార్యకలాపాలకు గట్టి నియంత్రణను కల్పిస్తుంది. నైతిక విలువల పరిరక్షణ, దేశ భద్రత, మత గౌరవం వంటి అంశాలపై తీవ్ర నిబంధనలు విధించబడ్డాయి. ఉల్లంఘనలపై ఎక్కువగా Dh1 మిలియన్ దిర్హాముల వరకు జరిమానాలు విధించవచ్చు.
ప్రధాన ఉల్లంఘనలు మరియు జరిమానాలు:
మత, నైతిక సంబంధిత ఉల్లంఘనలు
- దైవాన్ని, ఇస్లామిక్ నమ్మకాలను లేదా ఇతర మతాలను అవమానించడం: జరిమానా – Dh1,000,000
- ప్రజా నైతికతను ఉల్లంఘించడం, ధ్వంసాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం: Dh1,000,000 వరకు
- హత్య, మానభంగం, మాదకద్రవ్య వినియోగం వంటి నేరాలకు ప్రేరేపించే విషయాల ప్రచారం: Dh150,000 వరకు
దేశ, జాతీయ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలు
- పాలనా వ్యవస్థ, జాతీయ చిహ్నాలు, ప్రభుత్వ సంస్థలను అవమానించడం: Dh50,000- Dh500,000.
- దేశీయ/అంతర్జాతీయ విధానాలను అవమానించడం: Dh50,000-Dh500,000
- విదేశీ సంబంధాలు లేదా జాతీయ ఏకత్వాన్ని భంగపెట్టే కంటెంట్ ప్రచారం: Dh250,000 వరకు
లైసెన్సింగ్ ఉల్లంఘనలు
లైసెన్స్ లేకుండా మీడియా కార్యకలాపాలు:
- మొదటి తప్పిదం: Dh10,000
- తిరుగువారిగా: Dh40,000
- లైసెన్స్ కాలం ముగిసిన 30 రోజుల్లోగా పునరుద్ధరించకపోతే: Dh150/రోజుకు, గరిష్ఠంగా Dh3,000
- అనుమతి లేకుండా భాగస్వామిని మార్పు చేయడం/లైసెన్స్ వివరాల్లో మార్పులు: Dh20,000 వరకు
గడువు ముగిసిన లైసెన్స్తో ప్రచారం కొనసాగించటం:
- మొదటి తప్పిదం: Dh10,000
- తిరుగువారిగా: Dh20,000 (తర్వాతి ప్రతిసారి రెండింతలు)
తప్పుడు సమాచారం ప్రచారం
తప్పుడు సమాచారం ప్రసారం:
- మొదటి తప్పిదం: Dh5,000
- తిరుగువారిగా: Dh10,000
ఈవెంట్, ప్రచురణ ఉల్లంఘనలు
- అనుమతి లేకుండా పుస్తక ప్రదర్శన నిర్వహించడం లేదా అడ్డుకోవడం: Dh40,000 (తర్వాత రెట్టింపు)
- లైసెన్స్ లేకుండా ప్రచురణ/ప్రచారం: Dh20,000 (తర్వాత రెట్టింపు)
విదేశీ విలేఖరుల విధానాలు
లైసెన్స్ లేకుండా విదేశీ విలేఖరులుగా పనిచేయడం:
- మూడు రాత సూచనలు
- తిరుగువారిగా: Dh10,000 జరిమానా
ఈ చట్టం ద్వారా యూఏఈ ప్రభుత్వం మీడియా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, నైతిక విలువలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మీడియా వర్గాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







