అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- March 05, 2026
హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక ఐరిస్ దేనాపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRTC) ఉత్తర పర్షియన్ గల్ఫ్లో ఒక అమెరికన్ ట్యాంకర్ను ఢీకొట్టినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొంది. అమెరికా నౌక మంటల్లో చిక్కుకుందని ఇరాన్ మీడియా తెలిపింది. శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాపై జరిగిన దాడికి అమెరికా కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది.ఇజ్రాయెల్, అమెరికా తమ లక్ష్యాలను చేరుకున్నాయని, ఈ నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడైనా యుద్ధాన్ని ఆపివేయవచ్చని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారి ఇరాన్లో పాలకులు మారే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాలకులను మార్చుతామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. శ్రీలంక సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచివేయడం ఇరాన్కు పెద్ద దెబ్బగా మారింది. దీనికి ప్రతికారంగానే అమెరికా ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు సముద్ర మార్గాలకు పాకడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







