టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- March 05, 2026
టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కి దూసుకెళ్లింది.సెమీస్ లో ఇంగ్లండ్ పై గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 7 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మార్చి 8న ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ బాదింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉంచింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం ఉన్నా.. ఇంగ్లండ్ బ్యాటర్లు బెదరలేదు. దూకుడుగా ఆడారు. మరీ ముఖ్యంగా జాకబ్ బెతెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.పరుగుల వరద పారించాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు.భారత్ ను బాగా భయపెట్టాడు. 45 బంతుల్లోనే సెంచరీ బాదిన జాకబ్.. ఇంగ్లండ్ ను విజయం అంచుల వరకు తీసుకెళ్లాడు. చివరలో వికెట్లు పడటంతో, బెతెల్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయింది.
భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. మరీ ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తక్కువ పరుగులు ఇచ్చి (4 ఓవర్లు 33 పరుగులు 1 వికెట్) ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగాడు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









