టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- March 05, 2026
టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కి దూసుకెళ్లింది.సెమీస్ లో ఇంగ్లండ్ పై గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 7 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మార్చి 8న ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ బాదింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉంచింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం ఉన్నా.. ఇంగ్లండ్ బ్యాటర్లు బెదరలేదు. దూకుడుగా ఆడారు. మరీ ముఖ్యంగా జాకబ్ బెతెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు.పరుగుల వరద పారించాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు.భారత్ ను బాగా భయపెట్టాడు. 45 బంతుల్లోనే సెంచరీ బాదిన జాకబ్.. ఇంగ్లండ్ ను విజయం అంచుల వరకు తీసుకెళ్లాడు. చివరలో వికెట్లు పడటంతో, బెతెల్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయింది.
భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. మరీ ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తక్కువ పరుగులు ఇచ్చి (4 ఓవర్లు 33 పరుగులు 1 వికెట్) ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









