స్కూల్స్, డాక్టర్స్.. చికెన్ పాక్స్ సూచనలు జారీ..!!
- June 04, 2025
యూఏఈ: యూఏఈలోని డాక్టర్లు.. చికెన్ పాక్స్ సంబంధిత అడ్వైజ్ జారీ చేశాయి. పిల్లలకు చికెన్ పాక్స్ టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. చికెన్ పాక్స్ కేసులు నమోదు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని స్కూల్స్ హెల్త్ నోటీసులను జారీ చేశాయి. విద్యార్థులలో స్కార్లెట్ ఫీవర్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, విద్యార్థులలో కూడా కేసులు నమోదయ్యాయి. అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ అయిన చికెన్ పాక్స్.. వేసవి నెలల్లో కేసులు పెరుగుదల అధికంగా ఉంటుందని వైద్యులు వివరించారు. అధిక ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని, ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా సన్నిహితంగా ఉండే వారికి ఎక్కువగా సోకుతుందని సౌదీ జర్మన్ హాస్పిటల్ దుబాయ్లోని పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ హమ్జా రహల్ తెలిపారు.
"ఇటీవల చికెన్పాక్స్ కేసులు, ముఖ్యంగా పాఠశాల వయస్సు పిల్లలలో ఖచ్చితంగా పెరిగాయి. కొన్ని సందర్భాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రమైన లక్షణాలను మనం చూస్తున్నాము. అధిక జ్వరాలు, వాపుతో కూడిన దద్దుర్లు, గోకడం వల్ల చర్మ వ్యాధులు పెరుగుతాయి." అని షార్జాలోని మెడ్కేర్ హాస్పిటల్లోని స్పెషలిస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ మొహమ్మద్ షాహిద్ పడియార్ అన్నారు. సరైన వయస్సులో పిల్లలకు టీకాలు వేయడం ద్వారా చికెన్ పాక్స్ రాకుండా నివారించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







