స్కూల్స్, డాక్టర్స్.. చికెన్ పాక్స్ సూచనలు జారీ..!!
- June 04, 2025
యూఏఈ: యూఏఈలోని డాక్టర్లు.. చికెన్ పాక్స్ సంబంధిత అడ్వైజ్ జారీ చేశాయి. పిల్లలకు చికెన్ పాక్స్ టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. చికెన్ పాక్స్ కేసులు నమోదు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని స్కూల్స్ హెల్త్ నోటీసులను జారీ చేశాయి. విద్యార్థులలో స్కార్లెట్ ఫీవర్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, విద్యార్థులలో కూడా కేసులు నమోదయ్యాయి. అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ అయిన చికెన్ పాక్స్.. వేసవి నెలల్లో కేసులు పెరుగుదల అధికంగా ఉంటుందని వైద్యులు వివరించారు. అధిక ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని, ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా సన్నిహితంగా ఉండే వారికి ఎక్కువగా సోకుతుందని సౌదీ జర్మన్ హాస్పిటల్ దుబాయ్లోని పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ హమ్జా రహల్ తెలిపారు.
"ఇటీవల చికెన్పాక్స్ కేసులు, ముఖ్యంగా పాఠశాల వయస్సు పిల్లలలో ఖచ్చితంగా పెరిగాయి. కొన్ని సందర్భాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రమైన లక్షణాలను మనం చూస్తున్నాము. అధిక జ్వరాలు, వాపుతో కూడిన దద్దుర్లు, గోకడం వల్ల చర్మ వ్యాధులు పెరుగుతాయి." అని షార్జాలోని మెడ్కేర్ హాస్పిటల్లోని స్పెషలిస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ మొహమ్మద్ షాహిద్ పడియార్ అన్నారు. సరైన వయస్సులో పిల్లలకు టీకాలు వేయడం ద్వారా చికెన్ పాక్స్ రాకుండా నివారించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!







