ఫేక్ ఆన్లైన్ ప్రకటనల గురించి ప్రజలకు MOI హెచ్చరిక..!!
- June 05, 2025
కువైట్: పౌరులు, నివాసితులు ఫేక్ ఆన్లైన్ ప్రకటనలతో, ముఖ్యంగా మోసపూరిత లింక్ల ద్వారా చెల్లింపును అభ్యర్థించే చాలెట్ అద్దెకు సంబంధించిన ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ఒక బహిరంగ హెచ్చరికను జారీ చేసింది. ఆన్లైన్ మోసపూరిత కేసుల పెరుగుదలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
మోసపూరిత వెబ్సైట్లు లేదా అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా బాధితులను డబ్బు బదిలీ చేయమని ఆకర్షించే నకిలీ చాలెట్ అద్దె ప్రకటనలతో సహా అన్ని ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ధృవీకరించబడని లేదా అనధికారిక లింకులకు దూరంగా ఉండలని సూచించింది. అనుమానాస్పద సందేశాలు లేదా లింక్లకు ప్రతిస్పందించవద్దని కోరింది. ఇటువంటి సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే 97283939 అనే ప్రత్యేక హాట్లైన్ ద్వారా నివేదించాలని MOI పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









