ఫేక్ ఆన్లైన్ ప్రకటనల గురించి ప్రజలకు MOI హెచ్చరిక..!!
- June 05, 2025
కువైట్: పౌరులు, నివాసితులు ఫేక్ ఆన్లైన్ ప్రకటనలతో, ముఖ్యంగా మోసపూరిత లింక్ల ద్వారా చెల్లింపును అభ్యర్థించే చాలెట్ అద్దెకు సంబంధించిన ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ఒక బహిరంగ హెచ్చరికను జారీ చేసింది. ఆన్లైన్ మోసపూరిత కేసుల పెరుగుదలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
మోసపూరిత వెబ్సైట్లు లేదా అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా బాధితులను డబ్బు బదిలీ చేయమని ఆకర్షించే నకిలీ చాలెట్ అద్దె ప్రకటనలతో సహా అన్ని ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ధృవీకరించబడని లేదా అనధికారిక లింకులకు దూరంగా ఉండలని సూచించింది. అనుమానాస్పద సందేశాలు లేదా లింక్లకు ప్రతిస్పందించవద్దని కోరింది. ఇటువంటి సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే 97283939 అనే ప్రత్యేక హాట్లైన్ ద్వారా నివేదించాలని MOI పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









