ఫేక్ ఆన్లైన్ ప్రకటనల గురించి ప్రజలకు MOI హెచ్చరిక..!!
- June 05, 2025
కువైట్: పౌరులు, నివాసితులు ఫేక్ ఆన్లైన్ ప్రకటనలతో, ముఖ్యంగా మోసపూరిత లింక్ల ద్వారా చెల్లింపును అభ్యర్థించే చాలెట్ అద్దెకు సంబంధించిన ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ఒక బహిరంగ హెచ్చరికను జారీ చేసింది. ఆన్లైన్ మోసపూరిత కేసుల పెరుగుదలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
మోసపూరిత వెబ్సైట్లు లేదా అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా బాధితులను డబ్బు బదిలీ చేయమని ఆకర్షించే నకిలీ చాలెట్ అద్దె ప్రకటనలతో సహా అన్ని ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ధృవీకరించబడని లేదా అనధికారిక లింకులకు దూరంగా ఉండలని సూచించింది. అనుమానాస్పద సందేశాలు లేదా లింక్లకు ప్రతిస్పందించవద్దని కోరింది. ఇటువంటి సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే 97283939 అనే ప్రత్యేక హాట్లైన్ ద్వారా నివేదించాలని MOI పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







