దుబాయ్ లో టెనెంట్స్ కోసం అందుబాటులోకి కొత్త సేవలు..!!
- June 05, 2025
యూఏఈ: దుబాయ్ లో టెనెంట్స్ కోసం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వారి ఇంజాజ్ (Ejari) రిజిస్ట్రేషన్ను పూర్తి చేసి వాట్సాప్ ద్వారా అప్డేట్ చేయవచ్చు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇంజాజ్ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ట్రస్టీ తన ప్లాట్ఫామ్ అఖారీ ద్వారా ఈ సేవను ప్రారంభించింది.
ఈ ప్లాట్ఫామ్ ద్వారా టెనెంట్స్.. వ్యక్తిగత మరియు కంపెనీ సమాచార అప్డేట్ లు, టిల్ డీడ్ డేటా సవరణలు, ఆస్తి విలువలు, మ్యాప్ జారీ, యాజమాన్య నమోదు, మరిన్నింటితో సహా వివిధ ప్రక్రియలను వేగవంతం అవుతాయని తెలిపారు. దాంతో వ్యక్తిగతంగా కార్యాలయాలకు రావాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు.
DLD డేటా ప్రకారం.. ఆల్సోప్ & ఆల్సోప్ మే నెలలో రెంట్స్ అగ్రిమెంట్స్ రెన్యూవల్స్ నెలవారీగా 19 శాతం, విలువ 17 శాతం తగ్గిందని తెలిపింది. అయితే, అద్దె ఒప్పంద పరిమాణం నెలవారీగా 15 శాతం, విలువ నెలవారీగా 9 శాతం పెరిగింది. “దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ మా ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడానికి ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాలు, సహకారం చాలా కీలకమని గట్టిగా విశ్వసిస్తుంది. ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో దుబాయ్ ప్రముఖ స్థానాన్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం” అని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్లోని రియల్ ఎస్టేట్ సర్వీసెస్ పయనీరింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖలీఫా అల్సాల్ఫా అన్నారు.
"దుబాయ్లోని ఆస్తుల కోసం రియల్ ఎస్టేట్ లావాదేవీలను సరళీకృతం చేయడం,ఆధునీకరించడం మా లక్ష్యం. ఈ కొత్త ఫీచర్తో, క్లయింట్లు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎజారి రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన దశలను పూర్తిగా ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు." అని ఇంజాజ్ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ట్రస్టీ జనరల్ మేనేజర్ మాజిద్ అల్మాజ్రౌయ్ అన్నారు. వాట్సాప్ ద్వారా రిమోట్ రియల్ ఎస్టేట్ సేవల సమగ్ర సూట్ను అందించడానికి అకారి మొదట ఆగస్టు 2024లో ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









