ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న 'రియో డి జనారియో'
- July 12, 2016
మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ పండగ ప్రారంభం కానుంది. రియో డి జనారియో వేదికగా జరగబోయే ఈ పోటీల కోసం ప్రపంచ క్రీడాకారులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 5 నుంచి21 వరకు సాగే ఈ ఉత్సవానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
* దక్షిణ అమెరికాలో ఒలింపిక్స్ను నిర్వహించడం ఇదే తొలిసారి.* 17 వేల మంది ఒలింపిక్ అథ్లెట్లు, నిర్వాహకులు పాల్గొంటున్నారు. . * 206 దేశాలకు చెందిన క్రీడాకారులు పలు విభాగాల్లో పోటీపడనున్నారు. * ఒలింపిక్స్ పండగను ప్రారంభించే మరకానా స్టేడియం సామర్థ్యం 78 వేల మంది. ఇదే స్టేడియంలో ముగింపు వేడుకలు కూడా నిర్వహించనున్నారు. * తొలిసారిగా ఓ శరణార్థుల జట్టు ఈ ఒలింపిక్స్లో పాల్గొననుంది. * పోటీలను వీక్షించేందుకు కోసం 75 లక్షల టిక్కెట్లను అమ్మకానికి ఉంచారు. * 5 లక్షల మంది విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా. * ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా 16 కిలోమీటర్ల పొడవుగల భూగర్భ మెట్రో వ్యవస్థను ఏర్పాటు చేశారు. * 61 శాతం మంది స్థానికులు రియోలో పోటీలను నిర్వహించడం గొప్పగా భావిస్తే.. 27శాతం మంది మాత్రం అవసరం లేదంటున్నారు. * ఒలింపిక్స్ సమయంలో క్రీడా గ్రామంలోని డైనింగ్ హాల్లో రోజుకు 60వేల భోజనాలను వడ్డించనున్నారు. * 25వేల మంది విలేకరులు ఈ పోటీల కవరేజీకి వస్తున్నారు. * ఫుట్బాల్ పోటీల కోసం 400 బంతులను వినియోగించనున్నట్లు అంచనా. * ఫుట్బాల్ దేశంగా పేరొందిన బ్రెజిల్ ఒలింపిక్స్లో ఒక్కసారి కూడా పతకం సాధించలేకపోయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







