పాలస్తీనా సభ్యత్వ హోదా పెంపు.. స్వాగతించిన ఖతార్..!!
- June 07, 2025
దోహా: అంతర్జాతీయ కార్మిక సంస్థ పాలస్తీనా సభ్యత్వ హోదాను పెంచింది. "లిబరేషన్ మూవ్ మెంట్" నుండి "నాన్ మెంబర్ అబ్జర్వర్ మెంబర్"గా పెంచాలని చేసిన ప్రకటనను ఖతార్ స్వాగతించింది. అంతర్జాతీయ కార్మిక సమావేశం 113వ సెషన్లో ఓటు ద్వారా తీర్మానాన్ని ఆమోదించారు. పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులకు అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నట్లు ఖతాన్ తన ప్రకటనలో అభివర్ణించింది.
అంతర్జాతీయ సంస్థలో పూర్తి సభ్యత్వానికి పాలస్తీనా హక్కుకు మద్దతు ఇచ్చే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంతో ఈ ప్రకటన ఏకీభవించిందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో పాలస్తీనా స్థానాన్ని బలోపేతం చేసే విధంగా తీర్మానాన్ని అమలు చేయాలని ఖతార్ పిలపునిచ్చింది.
అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాలు, రెండు-రాష్ట్రాల పరిష్కారం ఆధారంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని ఖతార్ కోరుతోంది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల వెంబడి స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









