బహ్రెయిన్ ఇండియన్ స్కూల్లో ఘనంగా ఈద్ వేడుకలు..!!
- June 07, 2025
మనామా: బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ (BIS) లో ఈద్ అల్ అధా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆధ్యంతం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిలో సామరస్యం, ఫెస్టివ్ స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమం విద్యార్థులలో సాంస్కృతిక అవగాహన, పరస్పర గౌరవం, ఆధ్యాత్మిక విలువలను పెంచుతుందని ప్రిన్సిపాల్ సాజి జాకబ్ తెలిపారు.
కిండర్ గార్టెన్ విద్యార్థుల ఖవ్వాలి ప్రదర్శనతోపాటు రంగురంగుల సాంప్రదాయ దుస్తులను ధరించి ఈద్ ప్రాముఖ్యతపై ఒక చిన్న స్కిట్ కూడా ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమం తర్వాత, విద్యార్థులు ఈద్ నేపథ్య కార్యకలాపాలలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ సాజి జాకబ్ ఈద్ సారాంశాన్ని, దాని ఐక్యతను హైలైట్ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో కార్యక్రమం ముగిసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









