బహ్రెయిన్ ఇండియన్ స్కూల్లో ఘనంగా ఈద్ వేడుకలు..!!
- June 07, 2025
మనామా: బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ (BIS) లో ఈద్ అల్ అధా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆధ్యంతం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిలో సామరస్యం, ఫెస్టివ్ స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమం విద్యార్థులలో సాంస్కృతిక అవగాహన, పరస్పర గౌరవం, ఆధ్యాత్మిక విలువలను పెంచుతుందని ప్రిన్సిపాల్ సాజి జాకబ్ తెలిపారు.
కిండర్ గార్టెన్ విద్యార్థుల ఖవ్వాలి ప్రదర్శనతోపాటు రంగురంగుల సాంప్రదాయ దుస్తులను ధరించి ఈద్ ప్రాముఖ్యతపై ఒక చిన్న స్కిట్ కూడా ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమం తర్వాత, విద్యార్థులు ఈద్ నేపథ్య కార్యకలాపాలలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ సాజి జాకబ్ ఈద్ సారాంశాన్ని, దాని ఐక్యతను హైలైట్ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో కార్యక్రమం ముగిసింది.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







