జుమేరా బీచ్లో విషాదం.. స్కూబా డైవింగ్ సెషన్లో భారతీయ ప్రవాసి మృతి..!!
- June 08, 2025
దుబాయ్: జుమేరా బీచ్లో స్కూబా డైవింగ్ సెషన్లో 29 ఏళ్ల భారతీయ ప్రవాసి ప్రాణాలు కోల్పోయాడు. ఈద్ అల్ అధా సెలవులను దుబాయ్లో తన కుటుంబంతో గడుపుతుండగా ఈ విషాదకర దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడిని ఇస్సాక్ పాల్ ఒలక్కెంగిల్గా గుర్తించారు. అతను యూఏఈలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని బంధువుల కథనం ప్రకారం, నీటి అడుగున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఇస్సాక్ గుండెపోటుకు గురయ్యాడు. అతన్ని వెంటనే నీటిలోంచి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించాడు. “అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ను పూర్తి చేయడానికి మేము ప్రస్తుతం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నాము” అని మృతుని మామ ప్యారిలోస్ తెలిపారు.
జుమేరాలోని యాంఫిబియస్ స్విమ్ స్కూల్ వ్యవస్థాపకుడు , సీఈఓ, ఫిలిప్పీన్స్ బోధకుడు బింబో కాలిటిస్ మాట్లాడుతూ.. “డైవింగ్ నేర్చుకోవాలనుకునే వారు ముందుగా డైవింగ్ స్కూల్ నేపథ్యం, వాటి అనుభవాన్ని చెక్ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ పూర్తిగా చదవకుండానే వాటిపై సంతకాలు చేస్తున్నారు. డైవింగ్ స్కూల్ను చట్టపరమైన బాధ్యతల నుండి విముక్తి చేస్తున్నారు.” అని ఆయన వివరించారు. “లెర్నర్స్ ముందుగా వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి.” అని ఆయన సూచించారు. లైసెన్స్ పొందిన, విశ్వసనీయమైన డైవింగ్ పాఠశాలలను మాత్రమే ఎంచుకోవడం ద్వారా ఇలాంటి దుర్ఘటనలను నివారించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







