యునైటెడ్ కింగ్డమ్ లో బహ్రెయిన్ పార్లమెంటరీ టీమ్ పర్యటన..!!
- June 08, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్-ముసల్లం యునైటెడ్ కింగ్డమ్ లో అధికారిక పర్యటనను ముగించారు. రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సహకారం, భాగస్వామ్య పురోగతి కొత్త శకానికి ఈ పర్యటన నాంది పలుకుతుందని తెలిపారు. హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ సర్ లిండ్సే హోయల్ ఆహ్వానం మేరకు బహ్రెయిన్ టీమ్ పర్యటింది.
పార్లమెంటరీ, రాజకీయ, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వ్యూహాత్మక సమావేశాలు, చర్చలలో పాల్గొంది. ఈ పర్యటన సందర్భంగా అల్-ముసల్లం, సర్ లిండ్సే హోయల్ మధ్య కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమయంలో రెండు పార్టీలు ద్వైపాక్షిక పార్లమెంటరీ భాగస్వామ్యం కొత్త దశను ప్రారంభించడానికి అంగీకరించాయి.
ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం స్పీకర్ లండన్ నగర లార్డ్ మేయర్ ఆల్డెర్మాన్ అలస్టెయిర్ కింగ్తో కూడా చర్చలు జరిపారు. ఈ సమావేశం బహ్రెయిన్ - బ్రిటిష్ సంస్థల మధ్య ఆర్థిక సహకారం, పెట్టుబడి అవకాశాలను పెంచడంపై ఫోకస్ చేశారు. ప్రతినిధి బృందం యూకే పార్లమెంట్ ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్తో సమావేశమైంది. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!