యునైటెడ్ కింగ్డమ్ లో బహ్రెయిన్ పార్లమెంటరీ టీమ్ పర్యటన..!!
- June 08, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్-ముసల్లం యునైటెడ్ కింగ్డమ్ లో అధికారిక పర్యటనను ముగించారు. రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సహకారం, భాగస్వామ్య పురోగతి కొత్త శకానికి ఈ పర్యటన నాంది పలుకుతుందని తెలిపారు. హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ సర్ లిండ్సే హోయల్ ఆహ్వానం మేరకు బహ్రెయిన్ టీమ్ పర్యటింది.
పార్లమెంటరీ, రాజకీయ, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వ్యూహాత్మక సమావేశాలు, చర్చలలో పాల్గొంది. ఈ పర్యటన సందర్భంగా అల్-ముసల్లం, సర్ లిండ్సే హోయల్ మధ్య కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమయంలో రెండు పార్టీలు ద్వైపాక్షిక పార్లమెంటరీ భాగస్వామ్యం కొత్త దశను ప్రారంభించడానికి అంగీకరించాయి.
ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం స్పీకర్ లండన్ నగర లార్డ్ మేయర్ ఆల్డెర్మాన్ అలస్టెయిర్ కింగ్తో కూడా చర్చలు జరిపారు. ఈ సమావేశం బహ్రెయిన్ - బ్రిటిష్ సంస్థల మధ్య ఆర్థిక సహకారం, పెట్టుబడి అవకాశాలను పెంచడంపై ఫోకస్ చేశారు. ప్రతినిధి బృందం యూకే పార్లమెంట్ ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్తో సమావేశమైంది. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







