యునైటెడ్ కింగ్డమ్ లో బహ్రెయిన్ పార్లమెంటరీ టీమ్ పర్యటన..!!
- June 08, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్-ముసల్లం యునైటెడ్ కింగ్డమ్ లో అధికారిక పర్యటనను ముగించారు. రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సహకారం, భాగస్వామ్య పురోగతి కొత్త శకానికి ఈ పర్యటన నాంది పలుకుతుందని తెలిపారు. హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ సర్ లిండ్సే హోయల్ ఆహ్వానం మేరకు బహ్రెయిన్ టీమ్ పర్యటింది.
పార్లమెంటరీ, రాజకీయ, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వ్యూహాత్మక సమావేశాలు, చర్చలలో పాల్గొంది. ఈ పర్యటన సందర్భంగా అల్-ముసల్లం, సర్ లిండ్సే హోయల్ మధ్య కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమయంలో రెండు పార్టీలు ద్వైపాక్షిక పార్లమెంటరీ భాగస్వామ్యం కొత్త దశను ప్రారంభించడానికి అంగీకరించాయి.
ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం స్పీకర్ లండన్ నగర లార్డ్ మేయర్ ఆల్డెర్మాన్ అలస్టెయిర్ కింగ్తో కూడా చర్చలు జరిపారు. ఈ సమావేశం బహ్రెయిన్ - బ్రిటిష్ సంస్థల మధ్య ఆర్థిక సహకారం, పెట్టుబడి అవకాశాలను పెంచడంపై ఫోకస్ చేశారు. ప్రతినిధి బృందం యూకే పార్లమెంట్ ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్తో సమావేశమైంది. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!









