ఈద్ సెలవుల్లో సిమైస్మా బీచ్ లో ఉచిత ప్రవేశం..!!
- June 08, 2025
దోహా, ఖతార్: సిమైస్మా బీచ్ (ఫ్యామిలీ బీచ్, ఉమెన్స్ బీచ్)ను ఉచితంగా ప్రారంభిస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈద్ సెలవు ముగిసే వరకు కొనసాగుతుందని తెలిపింది. కుటుంబాలు, మహిళలు సెలవులను ఆస్వాదించడానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఈద్ అల్ అధా సెలవుల్లో తీరప్రాంత అందాలను ఆస్వాదించాలని ఆహ్వానిస్తోంది.
ఈద్ సెలవు దినాలలో ఖతార్ బీచ్లు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటని, ఇవి సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన వినోద కార్యక్రమాలకు నిలయంగా ఉన్నాయని తెలిపారు. అల్ ఘరియా బీచ్, అల్ మమ్లహా బీచ్ (మహిళల కోసం ), అల్ ఫర్కియా బీచ్, సిమైస్మా బీచ్, అల్ మఫ్జర్ బీచ్, 974 బీచ్, అల్ వక్రా పబ్లిక్ బీచ్, అల్ వక్రా ఫ్యామిలీ బీచ్, అల్ ఖరైజ్ బీచ్, సీలైన్ బీచ్ లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేలాది మంది దేశ తీరాలను సందర్శిస్తారని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీచ్ల సహజ సౌందర్యం, భద్రతను కాపాడటానికి ప్రజలు నిర్దేశిత ముఖ్యమైన మార్గదర్శకాలను పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అన్ని రకాల వ్యర్థాలను నియమిత కంటైనర్లలో సరిగ్గా పారవేయాని, లేదంటే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జీవులకు హాని కలిగిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









