కేటీఆర్ కూకట్పల్లిలో అర్థరాత్రి తనిఖీలు..
- July 12, 2016
రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూకట్పల్లిలో అర్థరాత్రి తనిఖీలు చేశారు. రాత్రి 11 గం. నుంచి 2 గంటల సమయంలో ఆయన పర్యటించారు. కేపీహెచ్బీ బస్టాండ్లో వాన నీరు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషా ముళ్లపూడి ప్రాంతంలోని రోడ్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. రహదారులు, ఫుట్పాత్ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగుబోతుల వీరంగానికి మృతిచెందిన పాప రమ్య ప్రమాదానికి గురైన స్థలాన్నికేటీఆర్ పరిశీలించారు. వర్షా కాలంలో రోడ్లు నరకంలా మారుతున్నాయని, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తగ్గించాలని ఆయన సూచించారు. పనులు సకాలంలో పూర్తిచేయకపోతే తగిన చర్చలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. నగరంలో తరచూ కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ అధికారుల్లో దడ పుట్టిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వదలి ప్రజల మంచి కోసం తోడ్పాటు కావాలని కేటీఆర్ కోరారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







