కేటీఆర్ కూకట్పల్లిలో అర్థరాత్రి తనిఖీలు..
- July 12, 2016
రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూకట్పల్లిలో అర్థరాత్రి తనిఖీలు చేశారు. రాత్రి 11 గం. నుంచి 2 గంటల సమయంలో ఆయన పర్యటించారు. కేపీహెచ్బీ బస్టాండ్లో వాన నీరు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషా ముళ్లపూడి ప్రాంతంలోని రోడ్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. రహదారులు, ఫుట్పాత్ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగుబోతుల వీరంగానికి మృతిచెందిన పాప రమ్య ప్రమాదానికి గురైన స్థలాన్నికేటీఆర్ పరిశీలించారు. వర్షా కాలంలో రోడ్లు నరకంలా మారుతున్నాయని, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తగ్గించాలని ఆయన సూచించారు. పనులు సకాలంలో పూర్తిచేయకపోతే తగిన చర్చలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. నగరంలో తరచూ కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ అధికారుల్లో దడ పుట్టిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వదలి ప్రజల మంచి కోసం తోడ్పాటు కావాలని కేటీఆర్ కోరారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









