ఒంటెల బలిదానాన్ని ఏ శాఖ అనుమతితో...

- July 12, 2016 , by Maagulf
ఒంటెల బలిదానాన్ని ఏ శాఖ అనుమతితో...

బక్రీద్‌ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఒంటెల బలిదానాన్ని ఏ శాఖ అనుమతితో జరుపుతున్నారని ప్రశ్నిస్తూ మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. వన్యప్రాణుల సంక్షేమ సంఘం నేతృత్వంలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ విషయమై దాఖలు చేసిన పలు ప్రజాహిత వాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు సంజయ్‌ కిషన్‌కౌల్‌, ఆర్‌.మహదేవన మంగళవారం విచారణ జరిపారు. బక్రీద్‌ పండుగ సందర్బంగా చెన్నై పరిసర ప్రాంతాల్లో ఏ రాజస్థాన్ నుండో తీసుకువచ్చిన ఒంటెలను కబేళాలకు తీసుకెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే నరికి చంపుతున్నారని, ఇటు కార్పొరేషన్ అధికారుల అనుమతిని గానీ, ఒంటెలను తరలించేందుకు కేంద్రప్రభుత్వ అనుమతిని గానీ తీసుకోవటమే లేదని పిటీషనర్లు చెబుతున్నారని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు.. తమకు తెలిసినంతవరకూ యేళ్లతరబడి ఆ ఒంటెలను చట్ట వ్యతిరేకంగానే తరలిస్తున్నట్లుందని, ఈ విషయమై తగు సంజాయిషీ ఇవ్వాలని కేంద్రప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. తగు వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. ఆ సందర్భంగా న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''ఒంటెలను నరికేందుకు చట్ట ప్రకా రం అనుమతినిస్తున్నారా? ఒంటెలను నరికేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయా? తమిళనాట ఒంటెలు లేవు కనుక ఇతర ప్రాంతాల నుండా వాటిని ఎవరి అనుమతితో తరలిస్తున్నారు? చెన్నై సిటీ మునిసిపల్‌ చట్టం ప్రకారం నగర కమిషనర్‌కు ఒంటెలను నరికేందుకు అనుమతి ఇచ్చే అధికారం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలి'' అని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com