ఒంటెల బలిదానాన్ని ఏ శాఖ అనుమతితో...
- July 12, 2016
బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఒంటెల బలిదానాన్ని ఏ శాఖ అనుమతితో జరుపుతున్నారని ప్రశ్నిస్తూ మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. వన్యప్రాణుల సంక్షేమ సంఘం నేతృత్వంలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ విషయమై దాఖలు చేసిన పలు ప్రజాహిత వాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కిషన్కౌల్, ఆర్.మహదేవన మంగళవారం విచారణ జరిపారు. బక్రీద్ పండుగ సందర్బంగా చెన్నై పరిసర ప్రాంతాల్లో ఏ రాజస్థాన్ నుండో తీసుకువచ్చిన ఒంటెలను కబేళాలకు తీసుకెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే నరికి చంపుతున్నారని, ఇటు కార్పొరేషన్ అధికారుల అనుమతిని గానీ, ఒంటెలను తరలించేందుకు కేంద్రప్రభుత్వ అనుమతిని గానీ తీసుకోవటమే లేదని పిటీషనర్లు చెబుతున్నారని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు.. తమకు తెలిసినంతవరకూ యేళ్లతరబడి ఆ ఒంటెలను చట్ట వ్యతిరేకంగానే తరలిస్తున్నట్లుందని, ఈ విషయమై తగు సంజాయిషీ ఇవ్వాలని కేంద్రప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. తగు వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. ఆ సందర్భంగా న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''ఒంటెలను నరికేందుకు చట్ట ప్రకా రం అనుమతినిస్తున్నారా? ఒంటెలను నరికేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయా? తమిళనాట ఒంటెలు లేవు కనుక ఇతర ప్రాంతాల నుండా వాటిని ఎవరి అనుమతితో తరలిస్తున్నారు? చెన్నై సిటీ మునిసిపల్ చట్టం ప్రకారం నగర కమిషనర్కు ఒంటెలను నరికేందుకు అనుమతి ఇచ్చే అధికారం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి'' అని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







