హజ్ మిషన్..420,000 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం..!!
- June 11, 2025
మక్కా: 1446 హిజ్ హజ్ సీజన్లో యాత్రికులకు సేవ చేయడానికి సహకరించిన 420,000 మందికి సుప్రీం హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు వారికి తవక్కల్నా యాప్ ద్వారా డిజిటల్ ప్రశంసా పత్రాలను జారీ చేసింది. సుప్రీం హజ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఖలీద్ అల్-సైఖాన్ మాట్లాడుతూ.. హజ్ మిషన్లో మొత్తం 420,070 మంది పాల్గొన్నవారిని తస్రీహ్ ప్లాట్ఫామ్ ద్వారా గుర్తించామని తెలిపారు. ఈ చొరవ సుప్రీం హజ్ కమిటీ పర్యవేక్షించే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ విజయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.హజ్ కార్మికుల అంకితభావాన్ని గుర్తించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించి ఈ రకమైన చొరవ ఇదే మొదటిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!