హజ్.. 234 మిలియన్లకు పైగా ఫుడ్, కామడిటిస్ పంపిణీ..!!
- June 11, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ సందర్భంగా యాత్రికులకు 234 మిలియన్లకు పైగా వస్తువులు, ఆహార ఉత్పత్తులు సరఫరా చేయబడినట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సామాగ్రిని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పంపిణీ చేసిన వాటిల్లో అత్యధికంగా జ్యూస్లు, కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు, బాటిల్ వాటర్, బేక్డ్ గూడ్స్, టిన్ ఫుడ్స్, ఇతర ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించింది. అదే సమయంలో వాణిజ్య సంస్థలు, రిటైల్ పాయింట్లు, స్టాల్స్పై మంత్రిత్వశాఖలోని పర్యవేక్షక అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు అవసరమైన వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న పలు దుకాణాలు, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







