హజ్.. 234 మిలియన్లకు పైగా ఫుడ్, కామడిటిస్ పంపిణీ..!!
- June 11, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ సందర్భంగా యాత్రికులకు 234 మిలియన్లకు పైగా వస్తువులు, ఆహార ఉత్పత్తులు సరఫరా చేయబడినట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సామాగ్రిని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పంపిణీ చేసిన వాటిల్లో అత్యధికంగా జ్యూస్లు, కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు, బాటిల్ వాటర్, బేక్డ్ గూడ్స్, టిన్ ఫుడ్స్, ఇతర ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించింది. అదే సమయంలో వాణిజ్య సంస్థలు, రిటైల్ పాయింట్లు, స్టాల్స్పై మంత్రిత్వశాఖలోని పర్యవేక్షక అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు అవసరమైన వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న పలు దుకాణాలు, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







