మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. అదుపునకు 6గంటలపాటు ఆపరేషన్..!!
- June 14, 2025
యూఏఈ: దుబాయ్లోని మెరీనాలోని 67 అంతస్తుల ఎత్తైన భవనంలో శుక్రవారం రాత్రి సంభవించిన మంటలను అధికారులు అదుపు చేశారని దుబాయ్ మీడియా ఆఫీస్ (DMO) వెల్లడించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను ఆర్పడానికి ఆరు గంటలు అవిశ్రాంతంగా శ్రమించాయి. ప్రత్యేక విభాగాలు మెరీనా పినాకిల్లోని 764 అపార్ట్మెంట్ల నుండి 3,820 మంది నివాసితులను ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా తరలించారు.
శనివారం తెల్లవారుజామున 2.21 గంటలకు, విజయవంతమైన తరలింపు ప్రయత్నాల గురించి DMO మరిన్ని వివరాలను తెలిపింది. బాధిత నివాసితుల భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ..వారికి తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఇప్పుడు భవనం డెవలపర్తో కలిసి పనిచేస్తున్నారు. కాగా, మంటలు అదుపులోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత కూడా టవర్ నుండి పొగ ఇంకా పైకి లేచినట్లు పలువురు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మెరీనా పినాకిల్.. దీనిని టైగర్ టవర్ అని కూడా పిలుస్తారు. అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. మే 25, 2015న 47వ అంతస్తులో వంటగదిలో జరిగిన ఒక సంఘటనలో మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ వారు అదుపులోకి తీసుకునే లోపు అది 48వ అంతస్తుకు వ్యాపించింది. 67 అంతస్తుల మెరీనా పినాకిల్ ది టార్చ్ సమీపంలో ఉంది.ఇది 2015, 2017లో రెండుసార్లు మంటల్లో చిక్కుకున్న మరో స్కైస్రేపర్. తాజా అగ్నిప్రమాదంలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







