అత్యవసర ప్రణాళికను అమలు చేసిన కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- June 14, 2025
కువైట్: కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ అత్యవసర ప్రణాళికను అమలు చేసింది. విద్యా మంత్రి జలాల్ అల్-తబ్తాబే మంత్రిత్వ శాఖ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి, విద్యకు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి అత్యవసర ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థుల భద్రత దృష్ట్యా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రాపిడ్ ఇంటర్వెన్షన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, 90 షెల్టర్లు ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







