మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు.. తమ పౌరులకు ఒమన్ అలెర్ట్..!!
- June 14, 2025
మస్కట్: ఉద్రిక్తత లేదా సాయుధ సంఘర్షణ ఎదుర్కొంటున్న ప్రాంతాలలో నివసిస్తున్న లేదా ప్రయాణించడానికి ప్రణాళిక వేసుకున్న ఒమానీ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఈ ప్రాంతంలో జరుగుతున్న భద్రతా పరిణామాల దృష్ట్యా వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. పరిస్థితులు అనుకూలించిన వెంటనే అటువంటి ప్రాంతాలలో ఉన్న పౌరులు అక్కడి నుండి బయలుదేరాలని మంత్రిత్వ శాఖ సూచించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక మొబైల్ అప్లికేషన్ లేదా +968 24634397 నంబర్లో ఆపరేషన్స్ ఆఫీస్ను సంప్రదించడం ద్వారా సమీపంలోని ఒమానీ రాయబార కార్యాలయంలో సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ప్రభావిత దేశాలకు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయాలని మంత్రిత్వ శాఖ పౌరులను కోరింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!