కువైట్లో ఇండియన్ ఎంబసీ, డాక్టర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- June 16, 2025
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్లోని భారత రాయబార కార్యాలయం.. భారత వైద్యుల ఫోరం సహకారంతో జూన్ 14న అడాన్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కువైట్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్వహాబ్ అల్ అవధి, కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా, సీనియర్ కువైట్ అధికారులు డాక్టర్ రీమ్ అల్ రద్వాన్, డాక్టర్ హనన్ అల్ అవధి, భారతీయ వైద్యుల ఫోరం సీనియర్ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
కువైట్లోని భారతీయ ప్రవాసులు రక్తదానం చేసే సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ.. పెద్ద సంఖ్యలో భారతీయ సమాజ సభ్యులు, ఇతర ప్రవాస సంఘాల నుండి కొందరు రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారత రాయబార కార్యాలయం, భారతీయ సమాజం మొత్తం కువైట్లో క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాయి. 2024లో ఎంబసీ, ఇండియన్ డాక్టర్స్ ఫోరం నిర్వహించిన రక్తదాన శిబిరాలతో పాటు, కువైట్లోని వివిధ భారతీయ సమాజ సంఘాలు 50 కి పైగా రక్తదాన శిబిరాలను చేపట్టాయి.
రక్తదాన శిబిరాలతో పాటు కువైట్లోని భారతీయ సమాజం మద్దతుతో భారత రాయబార కార్యాలయం.. చెట్ల పెంపకం, బీచ్ క్లీనింగ్, కువైట్లో పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం కోసం వివిధ కార్యక్రమాలు , శిబిరాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









