కువైట్లో ఇండియన్ ఎంబసీ, డాక్టర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- June 16, 2025
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్లోని భారత రాయబార కార్యాలయం.. భారత వైద్యుల ఫోరం సహకారంతో జూన్ 14న అడాన్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కువైట్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్వహాబ్ అల్ అవధి, కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా, సీనియర్ కువైట్ అధికారులు డాక్టర్ రీమ్ అల్ రద్వాన్, డాక్టర్ హనన్ అల్ అవధి, భారతీయ వైద్యుల ఫోరం సీనియర్ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
కువైట్లోని భారతీయ ప్రవాసులు రక్తదానం చేసే సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ.. పెద్ద సంఖ్యలో భారతీయ సమాజ సభ్యులు, ఇతర ప్రవాస సంఘాల నుండి కొందరు రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారత రాయబార కార్యాలయం, భారతీయ సమాజం మొత్తం కువైట్లో క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాయి. 2024లో ఎంబసీ, ఇండియన్ డాక్టర్స్ ఫోరం నిర్వహించిన రక్తదాన శిబిరాలతో పాటు, కువైట్లోని వివిధ భారతీయ సమాజ సంఘాలు 50 కి పైగా రక్తదాన శిబిరాలను చేపట్టాయి.
రక్తదాన శిబిరాలతో పాటు కువైట్లోని భారతీయ సమాజం మద్దతుతో భారత రాయబార కార్యాలయం.. చెట్ల పెంపకం, బీచ్ క్లీనింగ్, కువైట్లో పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం కోసం వివిధ కార్యక్రమాలు , శిబిరాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!







