వేసవిలో ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్ బంపరాఫర్..!!
- June 16, 2025
యూఏఈ: 2025 వేసవిలో ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్ సౌకర్యవంతమైన పని గంటలను ప్రకటించింది. ఇది జూలై 1 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 12 వరకు కొనసాగుతుందని దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం (DGHR) పేర్కొంది. తాత్కాలిక సౌకర్యవంతమైన ఈ వర్క్ మోడల్ అధికారిక ఐదు రోజుల పని దినాలతో కలిపి అమలు చేయనున్నారు. ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సోమవారం నుండి గురువారం వరకు ఎనిమిది గంటలు పని చేసి శుక్రవారం పూర్తి సెలవు దినంగా ఉండనుంది. రెండవ గ్రూప్ సోమవారం నుండి గురువారం వరకు ఏడు గంటలు, శుక్రవారం 4.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం, దుబాయ్ ప్రభుత్వం ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 30 వరకు 21 ప్రభుత్వ సంస్థలలో ఈ ప్రత్యేక చొరవను అమలు చేసింది. దుబాయ్లోని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండున్నర రోజుల వారాంతాన్ని (శుక్రవారం సగం రోజు, శనివారం,ఆదివారం) పొందుతారు.
యూఏఈ జూన్ 15 నుండి మధ్యాహ్నం వర్కర్ నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇది సెప్టెంబర్ 15 వరకు మూడు నెలల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యక్ష ఎండలో పనిచేసే కార్మికులపై నిషేధాన్ని అమలు చేస్తుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు ఒక్కో కార్మికుడికి దిర్హామ్లు 5,000 జరిమానా విధించబడుతుంది. ఈ వేసవిలో దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీస్ కార్మికుల కోసం 10,000 కంటే ఎక్కువ ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







