యూఏఈ: ఆన్లైన్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసితే జైలు శిక్ష, జరిమానా
- June 16, 2025
యూఏఈ: దేశ ప్రతిష్ఠను ఆన్లైన్లో అవమానించటం తగదని యూఏఈ అధికారులు హెచ్చరించారు. అబుధాబి న్యాయ విభాగం ఏప్రిల్ 29న ఎక్స్ (మునుపటి ట్విటర్) లో చేసిన ప్రకటన ప్రకారం, దేశం, ప్రభుత్వ సంస్థలు, అధికారులు అవమానించబడే విధంగా సమాచారాన్ని ప్రచురించిన వారికి ఐదు సంవత్సరాలతో జైలు శిక్షతో పాటు AED 500,000 వరకు జరిమానా విధించబడుతుందని పేర్కొనింది.
ఫెడరల్ చట్టం నెం (34) ఆఫ్ 2021 (అపవాదులు మరియు సైబర్ నేరాలతో పోరాటం) లోని ఆర్టికల్ (25) ప్రకారం ఇది వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 12న అబు ధాబి పోలీసు ప్రజలకు తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చెయ్యకూడదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, సమాజ విభజనకు కారణమయ్యే, నెగిటివ్ పోస్ట్లు చేసే వారికి Dh1 మిలియన్ వరకు జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడవచ్చని నిపుణులు తెలిపారు.
సోషల్ మీడియా వాడకంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని, ఏ సమాచారం పంచుకునే ముందు దాని నిజనిజాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







