ఇజ్రాయెల్ తో వార్.. టెహ్రాన్ వదులుతున్న పౌరులు, నివాసితులు..!!
- June 18, 2025
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్.. ఇజ్రాయెల్తో వివాదం తీవ్రతరం కావడంతో వేలాది మంది నివాసితులు, పౌరులు వలస బాట పట్టారు. ఎప్పుడు సందడిగా ఉండే డౌన్టౌన్ ఖాళీగా దర్శనమిస్తుంది. అనేక దుకాణాలను మూసివేశారు. చారిత్రాత్మక గ్రాండ్ బజార్ మూతపడ్డది.
సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్ మిడిల్ లో నివసిస్తున్న 330,000 మందిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. దాంతో భయంతో వేలాది మంది వసల బాట పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. దాంతో నగరం నుండి బయటకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. చాలామంది కాస్పియన్ సముద్ర ప్రాంతం వైపు వెళుతున్నారు. అదే సమయంలో ఇంధనం కోసం నివాసితులు ఇబ్బంది పడుతుండగా గ్యాస్ స్టేషన్ల వద్ద కూడా పొడవైన క్యూలు ఉన్నాయి. ఇంధనం సంక్షోభం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో కారుకు 25 లీటర్ల వరకే ఇంధనం అంటూ పరిమితులను విధించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్లో ఇరాన్ రాజధానిని వెంటనే ఖాళీ చేయమని పిలుపునిస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేయడం కూడా ఆందోళనలను మరింత పెంచింది. ఇదిలా ఉండగా, ప్రజల వలసలు పెరుగుతున్నప్పటికీ, పరిస్థితి అదుపులో ఉందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









